News November 1, 2025

విశాఖలో DRO నియామకం ఎప్పుడో?

image

విశాఖలో DRO, RDO మధ్య జరిగిన వివాదంతో ఇద్దరినీ బదిలీ చేశారు. DRO భవానీ శంకర్ స్థానంలో JCకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే మరో 2 వారాల్లో నగరంలో CII భాగస్వామ్య సదస్సుతో పాటు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. సాధారణంగా ప్రోటోకాల్ వ్యవహారాలు, ముఖ్య అధికారుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం వంటి పనులన్నీ DRO పరిధిలో ఉంటాయి. ఈ సమయంలో DRO స్థానం ఖాళీగా ఉండడంతో వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Similar News

News November 1, 2025

విశాఖ నుంచి బయల్దేరిన మంత్రి లోకేశ్

image

విశాఖ విమానాశ్రయానికి మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం సాయంత్రం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసిలాట ఘటనలో క్షతగాత్రులను వీరు పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మంత్రులు లోకేష్, అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వెళ్లారు.

News October 31, 2025

విశాఖ: పట్టణ ప్రణాళిక అధికారులులతో మేయర్ సమీక్ష

image

GVMC పరిధిలో ఎన్ని ప్రకటనల హోర్డింగు బోర్డులు ఉన్నాయి వాటి పూర్తి వివరాలను నివేదించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు GVMC పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం GVMC కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్రకటన హోర్డింగుల ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్‌కు ప్రకటన బోర్డులను ప్రదర్శించడానికి వాటికి ఎంత వసూలు చేస్తున్నారో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News October 31, 2025

UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

image

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.