News March 26, 2024
విశాఖ: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

విశాఖలో ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద వేగంగా వెళుతున్న ఆటో బోల్తా పడడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో వేగంగా వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నాలుగవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 12, 2026
విశాఖలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

విశాఖపట్నం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ జి.విలియమ్స్ సాప్ (SAAP) లీగ్స్ జిల్లా స్థాయి ఎంపికల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో చదరంగం, 24న బీచ్ రోడ్డులో సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో సాప్ (SAAP) అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.
News February 12, 2026
విశాఖలో మురికివాడల అభివృద్ధే లక్ష్యం

విశాఖలో మురికివాడల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. RKబీచ్-రుషికొండ వరకు 6 సులభ్ కాంప్లెక్స్లు.. వెలంపేట, ఇందిరానగర్లో పైలట్ ప్రాజెక్టుల కింద గృహ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
News February 12, 2026
ఆస్తిపన్ను బకాయిదారులపై GVMC కఠిన చర్యలు..

GVMC పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వసూళ్ల విషయంలో GVMC కఠినంగా వ్యవహారిస్తోంది. 2025-26 సంవత్సరానికి రూ.566 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.360 కోట్లు వసూలయ్యాయి. 6 లక్షలకు పైగా మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. చెల్లింపులు లేకపోతే ఆస్తుల సీజ్కు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 60 వేల మందికి నోటీసులు పంపగా.. మరో 20 వేల మందికి కుళాయి కనెక్షన్లు కట్ చేసేందుకి రెడీ అవుతున్నారు.


