News October 21, 2024

విశాఖ: ఆర్టీసీ ఎన్ఎంయూతో డీపీటీఓ చర్చలు సఫలం

image

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం నేషనల్ మజ్దార్ యూనిటీ అసోసియేషన్ జిల్లా కమిటీతో విశాఖ జిల్లా నూతన డీపిటిఓ ఎ.అప్పలనాయుడుతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఎన్ఎంయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చర్చల అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పీవీ. రమణారెడ్డి నిమ్మరసం ఇచ్చి గత 45 రోజులుగా జరుగుతున్న నిరాహారదీక్షలను నేటితో విరమింపజేశారు.

Similar News

News July 6, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసు కమిషనర్ శంఖ‌బ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.

News July 6, 2025

ప్ర‌చార ర‌థం ప్రారంభమయ్యేది అప్పుడే

image

జులై 9న మ‌.2 గంట‌ల‌కు సింహాచలం గిరిప్రదక్షిణ ప్ర‌చారర‌థం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథ‌రావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వ‌ద్ద అశోక్ గ‌జ‌ప‌తి చేతుల మీదుగా ప్ర‌చారర‌థం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ఆరోజు రాత్రి 11 గంట‌లకు ర‌థం ఆల‌యానికి చేరుకుంటుంద‌ని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వ‌ర‌కు ద‌ర్శ‌నాలు ఉంటాయన్నారు.

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

image

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.