News October 28, 2025
విశాఖ: ఇంటి పన్ను మార్చడానికి రూ.50,000 లంచం

తగరపువలసకు చెందిన పి.దుర్గారావు తన తాత పేరు మీద ఉన్న ఇంటి పన్నును భార్య, మరదలు పేరుమీద మార్చడానికి సచివాలయానికి వెళ్లాడు. ఈ పనికి రూ.50,000 లంచం కావాలని సచివాలయం సెక్రటరీ సోమునాయుడు, ఆర్ఐ రాజు అడగడంతో దుర్గారావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.
Similar News
News October 28, 2025
కాకినాడ పోర్టుకు 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ పోర్ట్లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను తగ్గించారు. గాలులకు తెగిపడే అవకాశం ఉన్నందున హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించారు. విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 28, 2025
GNT: చందమామ తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు

ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది,”కొకు” గా సుపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28-1980 ఆగస్ట్ 17) తెనాలిలో జన్మించారు. 50 ఏళ్ల రచనా జీవితంలో 12వేల పేజీలకు మించిన రచనలు చేశారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.
News October 28, 2025
HYD: 2 గంటలకుపైగా సోషల్ మీడియాలోనే

నేషనల్ వెబ్ ఇండెక్స్ సర్వే ప్రకారం నగర యువత రోజుకు 2 గంటలకుపైగా సోషల్ మీడియాలో గడిపేస్తున్నట్లు తేలింది. ఫ్యామిలీ పంచాయితీలు, వివరాలు అన్నీ ఇందులో పెట్టేస్తూ లేనిపోని వ్యవహారల్లో తలదూరుస్తున్నట్లు తేలింది. SMను సమాచారం కోసం కాకుండా వినోదం, కొత్త ఫ్రెండ్స్తో ఛాటింగ్కు ఓపెన్ చేస్తున్నట్లు తేలింది. దీంతో చదువు అటకెక్కుతుందని, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, SMపై నియంత్రణ అవసరమని సూచించారు.


