News April 2, 2024
విశాఖ ఎంపీగా ఇదే అత్యధిక మెజారిటీ

విశాఖ లోక్సభ స్థానం 1952లో ఏర్పడింది. ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 ఎన్నికల్లో ద్విసభ విధానంతో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపోందారు. 1984 ఎన్నికల్లో TDP నుంచి భాట్టం శ్రీరామమూర్తి అత్యధిక మెజారిటీ 1,40,431 నమోదుకాగా, 2019లో YCP నుంచి MVV సత్యనారాయణ అత్యల్ప మెజారిటీ 4,414 నమోదయ్యింది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News September 9, 2025
ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మూడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీ కృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు (34), మరో యువకుడు హరీశ్ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించామన్నారు.
News September 9, 2025
జ్ఞానపురంలో అర్ధరాత్రి హల్చల్.. ఇంటి యజమానిపై దాడి

జ్ఞానపురంలో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ముగ్గురు మహిళలు ఉంటున్న ఇంటి తలుపులు, కిటికీలు కొట్టడంతో వారు ఇంటి యజమానికి ఫోన్ చేశారు. ఇంటి ఓనర్ పీలా శ్రీనివాసరావు (55), తన కుమారుడు పూర్ణ సాయితో వెళ్లి ప్రశ్నించగా దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు కంచరపాలెం CI రవి కుమార్ మంగళవారం తెలిపారు. నిందుతులు పాత నేరస్తులైన దేవర కళ్యాణ్, దుర్గా ప్రసాద్గా గురించారు.
News September 9, 2025
పోక్సో కేసులో ముద్దాయిని పట్టుకున్న మహారాణిపేట పోలీసులు

మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో ముద్దాయి షేక్ అబ్దుల్ కలాం 18 నెలల నుంచి కోర్టుకు హాజరు కావడం లేదు. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసులు హైదరాబాద్, అనంతపురం జిల్లాలో విస్తృతంగా గాలించారు. సెల్ఫోన్ కూడా ఉపయోగించకుండా తిరుగుతున్న ముద్దాయిని మంగళవారం చాకచక్యంగా పట్టుకోవడంతో సిబ్బందిని సీపీ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.