News September 28, 2024

విశాఖ- కిరండూల్ రైళ్లు దంతెవాడ వరకు కుదింపు

image

విశాఖ- కిరండూల్ మధ్య నడుస్తున్న రైళ్లు వర్షాల కారణంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు దంతెవాడకు కుదించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి దంతెవాడ తిరుగు ప్రయాణంలో దంతెవాడ నుంచి విశాఖకు చేరుకుంటాయని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News October 10, 2024

పైడితల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

విజయనగర ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోయేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏర్పాట్లను చూసి అధికారులతో మాట్లాడిన తర్వాత ఉత్సవాలు ఘన విజయం అవుతాయనే నమ్మకం కలిగిందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి బుధవారం సమీక్షించారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని సూచించారు.

News October 9, 2024

మోసపోయిన విజయనగరం యువతి

image

విజయనగరానికి చెందిన యువతిని ఇద్దరు మోసగించారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామనే మాటలు చెప్పి ఆమె నుంచి రూ.9లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో వారిని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీస్తే, ఈ నిందితులు పలువురికి ఇలాగే మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. యువత ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 9, 2024

విజయనగరంలో నేడు డయల్ యువర్ MP కార్యక్రమం

image

విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంపై భక్తులు సలహాలు సూచనలు అందించాలని కోరారు. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు: 9440436426, MP క్యాంప్ ఆఫీస్: 8919060911, మున్సిపల్ కమిషనర్, విజయనగరం: 9849906486 నెంబర్లను సంప్రదించాలన్నారు.