News February 22, 2026
విశాఖ: చందనోత్సవం ముందే పనులు పూర్తి అవుతాయా?

సింహాచలం దేవస్థానంలో ప్రసాద్ పథకం పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవంలోగా పనుల పురోగతిపై సందేహాలు వస్తున్నాయి. రూ.5.40 కోట్ల బస్ కాంప్లెక్స్ 80% పూర్తయినప్పటికీ, మెట్లమార్గం అభివృద్ధి,యాంపీ థియేటర్, ఎలివేటర్, పార్కింగ్, యాగశాల వంటి పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. చందనోత్సవానికి ముందే అవసరమైన నిర్మాణాలు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని దేవస్థాన అధికారులు పర్యాటక శాఖను కోరుతున్నారు.
Similar News
News February 24, 2026
‘ఓం శాంతి శాంతి శాంతిః’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ మూవీ మార్చి 4 నుంచి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్ ఒకరోజు ముందే అంటే మార్చి 3 నుంచే ఈ చిత్రాన్ని చూడవచ్చు. భర్త పెట్టే హింసను భరిస్తూ చివరకు అతడికి తగిన గుణపాఠం చెప్పే భార్య కథే ఈ సినిమా స్టోరీ.
News February 24, 2026
కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు దుర్మరణం!

జార్ఖండ్లోని చత్రా జిల్లా సిమ్రియా సమీపంలో సోమవారం సాయంత్రం కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. రెడ్బర్డ్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగిందని చత్రా జిల్లా కలెక్టర్ కీర్తిశ్రీ ధ్రువీకరించారు.
News February 24, 2026
ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై కేసు

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై సోమవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్ను MLA నెట్టేశారణే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


