News January 9, 2026
విశాఖ జిల్లాలోకి గంజాయి తెస్తున్న మహిళలు

పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి పాతగాజువాక జంక్షన్ 38 బస్ స్టాప్ వద్ద ఏజెన్సీ నుంచి విశాఖకు 40 కేజీలు గంజాయి తీసుకువచ్చి దించుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పోలీసులకు వారిని అప్పగించారు
Similar News
News February 11, 2026
ఘోర ప్రమాదం.. ఆరుగురు యువకుల దుర్మరణం

రాజస్థాన్లోని జైపూర్-ఆగ్రా NHపై నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు మరణించారు. పెళ్లికి హాజరై తిరిగి కారులో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులు సమయ్ (25), లోకేశ్ (24), దిల్కుష్ (24), మనీశ్ (23), అంకిత్ (26), నవీన్ (23)గా గుర్తించారు. వారంతా మంచి మిత్రులంటూ కలాఖో గ్రామస్థులు కన్నీరుపెట్టుకున్నారు.
News February 11, 2026
MBNR:మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.
News February 11, 2026
అల్లూరి: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

అల్లూరి, పోలవరం జిల్లాల్లో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని అధికారులు తెలిపారు.


