News April 11, 2025
విశాఖ జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి విశాఖ నగరంలో వాతావరణ మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
Similar News
News April 18, 2025
విశాఖ: ‘చేపల వేట చేస్తే ప్రభుత్వ రాయితీల నిలుపుదల’

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వరకు సముద్ర జలాలో చేపల వేట నిషేధమని విశాఖ మత్స్యశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. సముద్ర జలాలలో చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కోసం వేట నిషేధం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేస్తే బోట్లను, బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రాయితీలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.
News April 18, 2025
విశాఖ: దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ప్రోగ్రాంకు పోలీసుల పర్మిషన్

విశాఖలో ఈ నెల 19న నిర్వహించనున్న దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ ప్రోగ్రాంకు పోలీసులు గతంలో పర్మిషన్ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మ్యూజికల్ ఈవెంట్స్ ప్రతినిధులు మరొకసారి పోలీసులకు అభ్యర్థన చేసుకున్నారు. వారి అభ్యర్థన మేరకు పోలీసులు పూర్తిగా సెక్యూరిటీని పరిశీలించి, భద్రతా చర్యలన్నీ ఏర్పాటు చేసినట్లు గుర్తించి మ్యూజికల్ ప్రోగ్రాంకు అనుమతులు ఇస్తున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు.
News April 18, 2025
విశాఖ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్

విశాఖ విమానాశ్రయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానంలోని ఇద్దరు ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు, నిషేధిత ఈ- సిగరెట్లను కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66,90,609 ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఫోన్లు, ఈ- సిగరెట్లను నగరానికి అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి వారిని పట్టుకున్నారు.