News July 5, 2024
విశాఖ జూకు చేరిన కొత్త అతిథులు
విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గుజరాత్లోని జామ్నగర్ రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి గ్రీన్ వింగ్ మకావ్, స్క్విరెల్ మంకీస్ తదితర వాటిని జంతువులు వచ్చాయి. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇవి విశాఖకు చేరుకున్నాయి. జంతువులను పరస్పరం మార్చుకునే విధానంలో ఇక్కడకు జంతువులను తీసుకువచ్చారు. కొత్త జంతువులను కొద్దికాలం క్వారంటైన్ అనంతరం సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు.
Similar News
News July 8, 2024
అనకాపల్లి: ప్రాణాలు తీసిన ఫొటోల సరదా
మాడుగుల మండలం తాచేరు ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వచ్చిన గుర్రం చందుమోహన్, గుబ్బల జ్ఞానేశ్వర్ అనే బావ బామ్మర్దులు నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు. తాచేరులో రాయిపై చందుమోహన్ నిల్చుని ఫొటో తీసుకుంటూ నీటిలో పడిపోగా.. అతనిని రక్షించేందుకు జ్ఞానేశ్వర్ నీటిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.
News July 8, 2024
అనకాపల్లి: హత్యకు ముందు లేఖ రాసిన నిందితుడు
రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. హోం మంత్రి ఆదేశాల మేరకు 12 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వ్యసనాలకు బానిసైన సురేశ్.. సైకో మాదిరిగా ప్రవర్తిస్తుంటాడని అతని పరిచయస్థులు తెలిపారు. తాను ఎందుకు హత్యచేశానో బాలిక అన్నయ్యకు ఓ లేఖను రాసి దాన్ని సంఘటనా స్థలం వద్దే ఉంచాడు. నిందితుడు ఫోన్ వాడకపోవడంతో పోలీసులకు సవాల్గా మారింది.
News July 8, 2024
విశాఖ: ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్లో సరికొత్త ఫీచర్లు
విద్యుత్ బిల్లులు చెల్లింపుల కోసం ఏపీ ఈపీడీసీఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్లో సరికొత్త ఫీచర్లు జత చేసినట్లు సంస్థ సీఎండి పృథ్వీతేజ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు సర్వీస్కు సంబంధించిన విద్యుత్ వినియోగం, బిల్లు వివరాలు, బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వివరాలు తెలుసుకునేలా సరికొత్త ఫీచర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు.