News September 9, 2025
విశాఖ జూపార్క్లో తెల్ల గడ్డం కోతులు

విశాఖ జూ పార్కులో తెల్ల గెడ్డం కోతులు సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నాయి. వీటిని పర్వత కోతులు అని పిలుస్తారు. నల్లటి కోటు ధరించినట్టు కనిపిస్తూ, గెడ్డం చుట్టూ తెల్ల బొచ్చుతో వింత హావభావాలతో ఈ కోతులు జూ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవి పళ్ళు, విత్తనాలు, లేత ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. కనువిందు చేసే ఈ కోతులను చూడాలంటే మరి మీరు కూడా విశాఖ జూ పార్కును సందర్శించాల్సిందే.
Similar News
News September 9, 2025
విశాఖ: ‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షిస్తాం’

మూగ బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్శన్ రాయపాటి శైలజ తెలిపారు. కేజీహెచ్లో మంగళవారం ఆమె బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కామాధులకు కళ్ళు తెరిచేలా శిక్ష పడుతుందని అన్నారు.
News September 9, 2025
మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు I.F.Cతో ఒప్పందం

మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు జీవీఎంసీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (I.F.C.) మధ్య ఒప్పందం కుదిరింది. రూ.553 కోట్లు చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐ.ఎఫ్.సి.తో దేశంలో తొలిసారి జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ప్లాంట్ 225 ఎం.ఎల్.డి వ్యర్థచరాలను శుద్ధి చేస్తుందని చెప్పారు
News September 8, 2025
విశాఖ జిల్లాలో 67.56% స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ పూర్తి

విశాఖ జిల్లాలో కేటాయించిన 5,17,155 స్మార్ట్ రైస్ కార్డులలో 67.56% పంపిణీ పూర్తయింది. మండలాల వారీగా అనందపురం 84.35%, భీమునిపట్నం 79.74%, సర్కిల్-III అర్బన్ 71.93%, సర్కిల్-I అర్బన్ 59.26% పూర్తి అయ్యాయి. మిగిలిన వారికి త్వరలోనే సచివాలయ సిబ్బంది/డీలర్ల ద్వారా అందజేస్తామని.. కార్డు వివరాలు epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తెలిపారు.