News August 12, 2025
విశాఖ జూపార్క్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం

విశాఖ జూ పార్క్లో క్యూరేటర్ మంగమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇందిరాగాంధీ జూ పార్క్లో ప్రస్తుతం కృష్ణ, రాజు, సరస్వతి, లక్ష్మీ అనే నాలుగు ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయని జూపార్క్ సిబ్బంది వివరించారు.
Similar News
News August 12, 2025
విశాఖ: ‘ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలి’

ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న మహిళల ఫ్రీ బస్ పథకాన్ని వృక్ష అతిథులతో ప్రారంభించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సిబ్బంది సిద్ధం కావాలని అన్నారు. పథకం అమలులో లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News August 12, 2025
కంచరపాలెంలో కారు ఢీకొని బాలుడి మృతి

కంచరపాలెం సుభాష్ నగర్లో మంగళవారం రాత్రి విషాదం నెలకొంది. కారు ఢీకొని 15 నెలల చిన్నారి వర్షిత్ మృతి చెందాడు. ఐటీఐ జంక్షన్ నుంచి ఊర్వశి జంక్షన్ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. చిన్నారి తండ్రి రాంబాబు ప్లంబర్ చేస్తున్నారు. బాలుడుని కారు ఢీకొట్టిన సమయంలో తండ్రి సమీపంలోనే ఉన్నట్లు సమచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 12, 2025
విశాఖలో వైసీపీ కార్పొరేటర్ గెలుపుపై జగన్ హర్షం

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు మంగళవారం తాడేపల్లిలో కలిశారు. విశాఖలో చేపడుతున్న కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డికి వివరించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కేకే రాజుకు సూచించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ కార్పొరేటర్ గెలుపుపై జగన్మోహన్ రెడ్డి అభినందించారు.