News February 10, 2025
విశాఖ జూలో తల్లి సాంబార్ డీర్ ప్రేమకు సందర్శకుల ఫిదా..!

తల్లులు తమ పిల్లల మీద చూపించే ప్రేమకు వెలకట్టలేము. విశాఖ జూ పార్కులో ఒక తల్లి సాంబర్ డీర్ తమ పిల్లను అల్లారు ముద్దుగా సాకుతో తల్లి ప్రేమ కు అవధులు లేవని నిరూపిస్తుంది. పిల్ల ఆకలి తెలుసుకుని పాలివ్వడం కాకుండా శత్రువుల నుంచి కాపాడేందుకు దట్టమైన వృక్షాల మధ్యలో దాచిపెడుతుంది. తల్లి ప్రేమకు సాధ్యమైన ఈ దృశ్యం చూపరులను ఆలోచింపజేస్తూ అందరూ ఫిదా అయ్యేలా చేస్తుంది.
Similar News
News March 13, 2025
అవయవ దానానికి ముందుకు రావాలి: కలెక్టర్

బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్లో వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి అమర్చారని గుర్తు చేశారు.
News March 13, 2025
విశాఖ: హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు

ఫీజులు పెండింగ్లో ఉన్నాయన్న నెపంతో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లకు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖకు చెందిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. స్కూల్ యాజమాన్యాలు ఫీజులపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదన్నారు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులు పరీక్షలు రాయవచ్చన్నారు.
News March 13, 2025
పద్మనాభం: భూములు పరిశీలించిన జేసీ మాయూర్ అశోక్

పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, రెడ్డిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్ పరిశీలించారు. తహసీల్దారు కె.ఆనందరావుతో కలిసి ఆయా గ్రామాల్లోని భూములను పరిశీలించారు. వాటి రికార్డులు, భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అవకాశాలు కుదిరితే ఈ భూములను ఏపీఐఐసీకి బదలాయించి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.