News April 13, 2025

విశాఖ జూలో 27 జింకల జననం

image

విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలలో 27 జింకలు పుట్టినట్లు క్యూరేటర్ మంగమ్మ ఆదివారం తెలిపారు. జూ పార్క్‌లో జంతువుల సంతానోత్పత్తి, పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో ఒక మౌస్ డీర్, రెండు బార్కింగ్ డీర్, మూడు నీల్‌ ఘై, ఐదు సాంబార్ డీర్, ఏడు స్పాటెడ్ డీర్, తొమ్మిది బ్లాక్ బక్స్ ఉన్నాయన్నారు. జూ సందర్శకులు ఈ అందమైన జింకలను చూసేందుకు మరికొద్ది రోజుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.

Similar News

News April 15, 2025

విశాఖ: లారీ ఢీకొని మహిళ మృతి

image

విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.

News April 15, 2025

పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: అనకాపల్లి ఎస్పీ

image

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.

News April 15, 2025

సింహాచలం చందనోత్సంపై సమీక్షించనున్న మంత్రి 

image

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి 10:45కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఓ హోటల్‌లో బస చేస్తారు. బుధవారం సింహాచలం దేవాలయానికి వెళ్లి చందనోత్సవ పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేస్తారు. సాయంత్రం సింహాచలం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

error: Content is protected !!