News January 10, 2026

విశాఖ జూ పార్క్‌లో స్వాన్, ఈము పిల్లల పునరుత్పత్తి

image

విశాఖ జూ పార్కులో కొన్ని వారాలుగా స్వాన్, ఈము గుడ్లను కృత్రిమంగా ఇంక్యూబేటర్‌లో పెట్టారు. శనివారం ఈ గుడ్ల నుంచి 6 ఈము పిల్లలు, ఒక బ్లాక్ స్వాన్ పిల్ల వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. అంతేకాకుండా రెండు సాంబార్ జింకలు, రెండు నీలిగాయి, మూడు బ్లాక్ బక్స్ కూడా జన్మించినట్లు చెప్పారు. విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

Similar News

News February 11, 2026

శాస్త్ర రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు

image

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం అందించడం కోసం ఓ రోజు ఉండాలని యునెస్కో నిర్ణయించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్‌&టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

News February 11, 2026

కామారెడ్డి జిల్లా 1 గం. పోలింగ్ అప్‌డేట్

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 1 గం వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో 99,313 ఓటర్లు ఉండగా కామారెడ్డి 43,486 మంది (43.79%), బాన్సువాడ 12,217 (50.51%), బిచ్కుంద 7,743 (60.69%), ఎల్లారెడ్డి 7,020 మంది (52.92%) ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం పోలింగ్ వేగం పుంజుకొని ఉత్సాహంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 47.13% పోలింగ్ నమోదైంది.

News February 11, 2026

మారిన చైనా వైఖరి: UNSCలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు!

image

UNSCలో భారత్ శాశ్వత సభ్యత్వ ఆకాంక్షలను ‘గౌరవిస్తాం’ అని చైనా ప్రకటించింది. గతంలో ఆ దిశగా ఇండియా చేసిన యత్నాలను వ్యతిరేకించిన ఏకైక శాశ్వత సభ్యదేశం చైనా కావడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన చర్చల్లో భారత్ అధ్యక్షతన జరగబోయే BRICS సదస్సుకు కూడా చైనా పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మార్పు అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాబల్యాన్ని పెంచడంతో పాటు మండలిలో శాశ్వత సభ్యత్వానికి మార్గాన్ని సుగమం చేసే ఛాన్స్ ఉంది.