News May 7, 2024
విశాఖ: టీడీపీలో చేరిన YSR ముఖ్య అనుచరుడు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి కొయ్య ప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరారు. సోమవారం అనకాపల్లిలో జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీతీర్థం పుచ్చుకున్నారు. ప్రసాద్ రెడ్డికి టీడీపీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
Similar News
News October 22, 2025
విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.
News October 22, 2025
గవర్నర్కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి,ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి పీఎంపాలెం వెళ్లారు.
News October 22, 2025
విశాఖలో రూ.7,62,892 విలువ గల బాణసంచా సీజ్

విశాఖలో దీపావళి వేడుకల్లో 3 సంవత్సరాల కంటే చాలా తక్కవ వాయుకాలుష్యం నమోదు అయ్యింది. సీపీ ఆదేశాలతో పోలీసులు దాడులు జరిపి 39 కేసులు నమోదు చేసి, రూ.7,62,892 విలువ గల నకిలీ మందుగుండు సామగ్రి, లైసెన్స్ లేని బాణసంచా సామగ్రి సీజ్ చేశారు. ఈ సంవత్సరం దీపావళి తర్వాత, 3 మూడు సంవత్సరాల కంటే తక్కువగా నగరంలో వాయుకాలుష్యం నమోదు అయిందని విశాఖ పోలీసులు బుధవారం తెలిపారు.