News December 19, 2025

విశాఖ: టెట్ పరీక్షకు 168 మంది గైర్హాజరు

image

విశాఖలో శుక్రవారం 15 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 1,848 మంది అభ్యర్థులకు గానూ 1,680 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 168 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో తెలిపారు.

Similar News

News December 31, 2025

కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం: ఏఐటీయూసీ

image

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ విశాఖలో గళమెత్తారు. ఈ కోడ్లు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తే కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా FEB 12న జరగనున్న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు.

News December 31, 2025

న్యూ ఇయర్: డ్రగ్స్ కనిపిస్తే ఈ నంబరులో ఫిర్యాదు చేయండి

image

విశాఖలో నూతన సంవత్సర వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, ఈవెంట్లలో అశ్లీలత, మాదకద్రవ్యాలకు తావులేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, 45 డెసిబెల్స్ లోపు శబ్దం, మైనర్లకు నో ఎంట్రీ వంటి నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. డ్రగ్స్ పట్ల ‘జీరో టాలరెన్స్’ పాటిస్తామని, ఎక్కడైనా డ్రగ్స్ కనిపిస్తే 7995095799 లేదా 1972 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News December 31, 2025

ప్రసాదంలో నత్తపై ప్రశ్నిస్తే కేసులా?: కేకే రాజు

image

సింహాచలం ప్రసాదంలో నత్త రావడంపై ప్రశ్నించిన భక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆలయాలను రాజకీయ వేదికలుగా మార్చడం వల్లే నిర్వహణ అస్తవ్యస్తమైందని, భక్తులను కేసులతో భయపెట్టడం దారుణమన్నారు.