News February 18, 2025

విశాఖ: టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

image

టెన్త్ క్లాస్ చదువుతున్న కే.సాస మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. అక్కయ్యపాలెం ఎన్. జి.జి..ఓఎస్.కాలనీ ఓ అపార్ట్మెంట్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. బాలిక సీతమ్మధారలోని ఓ స్కూల్‌లో చదువుతుంది. ఏమైందో తెలియదు గానీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Similar News

News February 20, 2025

విశాఖ టుడే టాఫ్ న్యూస్

image

☞ విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ☞గంజాయి తాగినా రౌడీషీట్: విశాఖ DIG ☞కనకమహాలక్ష్మి సేవలో విదేశీ యువతులు ☞విశాఖ: VRS చేస్తే రూ.50 లక్షలు..! ☞ రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా ☞విశాఖలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు ☞విశాఖ: జనారణ్యంలోకి వచ్చిన దుప్పి ☞హైదరాబాద్‌లో విశాఖ యువకుడి మృతి ☞ఆనందపురం: ఆవు పొట్టలో 50 కేజీల ప్లాస్టిక్ ☞విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు

News February 20, 2025

విశాఖ: త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు

image

గ్రూప్-2 ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చ‌రించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇత‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా త‌ప్పుడు వార్త‌ల‌ను, స‌మాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుంద‌న్నారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

News February 20, 2025

 విశాఖ: 16 కేంద్రాల్లో గ్రూప్-2 ప‌రీక్ష‌ నిర్వహణ

image

ఫిబ్రవరి 23న జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో గ్రూప్ -2 ప‌రీక్ష జ‌ర‌గ‌నుంద‌ని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు, ప‌రీక్షా కేంద్రాల‌ నిర్వాహ‌కుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశమైన ఆయ‌న ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు.

error: Content is protected !!