News May 19, 2024

విశాఖ: తాగునీటికి అంతరాయం.. జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ పరిధిలోని జోన్ -2 మే నెల 20న తాగునీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు మెరుగైన తాగనీటి సరఫరా చేసే పనిలో భాగంగా, బోణి గ్రామం వద్ద ఉన్న కోస్తానని హేట్ వాటర్ వర్క్స్ నుంచి తగరపువలస వరకు నూతనంగా 400 మీ.మీ మందం గల పైప్ లైన్లను వేస్తున్నట్లు వివరించారు. నగర వాశుల సహకరించాలని కోరారు.

Similar News

News September 30, 2024

స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎండీగా ఎంఓఐఎల్ ఛైర్మన్ అజిత్ కుమార్ సక్సెనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టీల్‌ప్లాంట్ నూతన సీఎండీగా ఎస్.శక్తిమణి ఇప్పటికే సెలెక్ట్ అయ్యారు. గత సీఎండీ అతుల్ భట్ ఉద్యోగ కాలం నవంబర్ నెలాఖరు వరకూ ఉంది. అంతవరకూ అజిత్ కుమార్ సక్సేనా సీఎండీగా వ్యవహరించనున్నారు.

News September 29, 2024

ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

image

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News September 29, 2024

అరకులో పాస్ పోర్టు ఆఫీస్..!

image

అరకులోయలో పాస్ పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ సంజయ్ పాండా తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని ఉప తపాలా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు పాస్ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఉప తపాలా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.