News October 26, 2024
విశాఖ: తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులు చేసిన ఆంధ్ర

ఆంధ్ర-హిమాచల్ ప్రదేశ్ గ్రూప్-బి రంజీ ట్రోఫీ మ్యాచ్ శనివారం విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి హిమాచల్ ప్రదేశ్ బౌలింగ్ ఎన్నుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టు తొలిరోజు ఇన్నింగ్స్లో 80 ఓవర్లకు 295 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఎస్.కె.రషీద్ 132 బంతుల్లో 9 ఫోర్లతో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేఎస్ భరత్ 65 పరుగులు చేశాడు.
Similar News
News July 7, 2025
విశాఖ: ’10 వేల మంది మార్గదర్శులను గుర్తించాలి’

పీ-4 విధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పని చేయాలని, జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాల అవసరాలను తెలుసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్షరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే మార్గదర్శులను వారం రోజుల్లో గుర్తించాలని ఆదేశించారు. సచివాలయం పరిధిలో 50 బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించాలన్నారు.
News July 7, 2025
విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.
News July 7, 2025
విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.