News March 31, 2024
విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ రాజకీయ ప్రస్థానం ఇదే

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి ఆయన ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో 2021లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
Similar News
News September 30, 2025
విశాఖ జూలో రెండు ఆసియా సింహం పిల్లల జననం

విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో రెండు ఆసియా సింహం పిల్లలు జన్మించాయి. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయిని, ప్రస్తుతం పశువైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ మంగళవారం తెలిపారు. అంతరించిపోతున్న జాతిగా నమోదైన ఆసియా సింహాల సంతానోత్పత్తి, పరిరక్షణ ప్రయత్నాల్లో ఈ జననం ఒక విజయమని ఆమె పేర్కొన్నారు.
News September 30, 2025
బురుజుపేట: గజలక్ష్మి అవతారంలో కనకమహాలక్ష్మి

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారు గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గాజులతో సుందరంగా అలంకరించారు. అనంతరం సహస్రనామార్చన చేపట్టారు. ఈవో శోభారాణి భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
News September 30, 2025
విశాఖలో కీచక తండ్రికి మరణశాసనం

ముక్కుపచ్చలారని ఐదేళ్ల కూతురిపై మద్యం మత్తులో కన్న తండ్రే లైంగిక దాడి చేశారు. నిందితుడికి మరణం వరకూ కఠిన కారాగారా జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభత్వం బాధితురాలికి రూ.5లక్షల నష్ట పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.15/04/25న భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలో రాయితి అప్పన్నపై కేసు నమోదవ్వగా కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.