News December 5, 2024

విశాఖ: ‘దీపం -2 ప‌థ‌కంపై మరింత ఫోక‌స్ పెట్టాలి’

image

దీపం-2 ప‌థ‌కంపై అధికారులు మ‌రింత ఫోక‌స్ పెట్టాల‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశామయ్యారు. గ్యాస్ బుకింగ్, డెలివ‌రీ ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌ర‌గ‌కుండా చూడాల‌న్నారు. గ్యాస్ డెలివ‌రీ స‌మ‌యంలో, E-KYC స‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి న‌గ‌దు తీసుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. అలా చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాల‌ని ఆదేశించారు.

Similar News

News November 10, 2025

గాజువాక: బార్‌లో వెయిటర్ ఆత్మహత్య

image

గాజువాకలోని ఓ బార్‌లో వెయిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. వై.జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్‌లో చంద్రమోహన్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. బార్‌లోనే చంద్రమోహన్ ఉరివేసుకోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News November 10, 2025

బురుజుపేటలో పాత సంప్రదాయాలే పాటించాలి..

image

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో EO శోభారాణి నిర్ణయాలపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సంప్రదాయ పద్ధతులు మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో భక్తులకు స్వేచ్ఛగా అభిషేకాలు, పూజలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు జల్లెడ పెడుతున్నారని, రాత్రిళ్లు గేట్లు మూసేస్తున్నారని ఆరోపించారు. ఈ విషమం MLA వంశీకృష్ణ దృష్టికి భక్తులు తీసుకెళ్లాగా పాత పద్ధతిలనే కొనసాగించాలని EOను అదేశించారు.

News November 10, 2025

13 నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీలో తరగతుల రద్దు

image

AU ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పార్ట్నర్షిప్ సమిట్-2025 జరగనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. హాస్టల్ విద్యార్థులు తమ గుర్తింపు కార్డులను చూపి బయటకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థినులు మద్దిలపాలెం గేటు, విద్యార్థులు పోలమాంబ ఆలయం పక్కన ఉన్న గేటు వినియోగించాలి.