News July 12, 2024

విశాఖ: ‘నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’

image

విశాఖ నగర పరిధిలో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 12, 2024

చివరి నిమిషంలో పరుగులు తీసిన ప్రయాణికులు

image

కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్‌పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.

News October 12, 2024

విశాఖ: ఓపెన్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 27 కు వాయిదా వేసినట్లు డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల అధ్యయన కేంద్రం రీజినల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 14న జరగాల్సిన పరీక్షలను నాక్ బృందం సందర్శన కారణంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి 27 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

News October 12, 2024

సింహాద్రి అప్పన్న జమ్మి వేట ఉత్సవానికి ఏర్పాట్లు

image

విజయదశమి సందర్భంగా ఈనెల 13న సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో జమ్మి వేట ఉత్సవం నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పూల తోటలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సింహాద్రి అప్పన్నను శ్రీరాముడిగా అలంకరించి సాయంత్రం పల్లకిలో కొండదిగువకి తీసుకువస్తారు. శమీ వృక్షానికి పూజ చేసి జమ్మి వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల వరకే స్వామి దర్శనాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.