News October 21, 2025
విశాఖ-పార్వతీపురం స్పెషల్ ట్రైన్పై మీ కామెంట్

విశాఖ-పార్వతీపురం స్పెషల్ ట్రైన్కు డైలీ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధిక సంఖ్యలో ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి సా.4గంటలకు విశాఖ వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగే ఈ ట్రైన్ ఈనెల 27వరకు నడవనుంది.
Similar News
News October 21, 2025
విశాఖకు గూగుల్ రావడం జగన్కు ఇష్టం లేదనిపిస్తోంది: మాధవ్

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తూ YS జగన్ కనీసం ట్వీట్ కూడా చేయలేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆక్షేపించారు. గూగుల్ పెట్టుబడులు రావడం ఆయనకు ఇష్టం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తుంటే ఎందుకు స్వాగతించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితాలు రుచిచూపిస్తున్నామని చెప్పారు.
News October 21, 2025
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అంబర్పేట్ కార్ హెడ్క్వార్టర్లో సీపీ సుధీర్ బాబు, డీసీపీలు, సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని తెలిపారు.
News October 21, 2025
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అంబర్పేట్ కార్ హెడ్క్వార్టర్లో సీపీ సుధీర్ బాబు, డీసీపీలు, సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని తెలిపారు.