News July 19, 2024
విశాఖ: పిల్లలను బెదిరించే ప్రయత్నంలో తండ్రి మృతి

‘మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా’ అంటూ పిల్లల అల్లరిని మాన్పించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం ఆతని ప్రాణాలనే తీసింది. ఈ ఘటన గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన చందన్ కుమార్(33) పిల్లలు డబ్బులు చించేయడంతో వారిపై కోప్పడగా భార్య అడ్డు పడింది. దీంతో చందన్ ఫ్యాన్కు చీరకట్టి పిల్లలను భయపెట్టే ప్రయత్నం చేశారు. అదికాస్తా బిగుసుకుపోయి అతని ప్రాణాలు తీసింది.
Similar News
News July 6, 2025
కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: కె.కె రాజు

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పథకాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News July 6, 2025
‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.
News July 6, 2025
గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 2

➦ అనకాపల్లి నుంచి సిటీ వైపు వచ్చే భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ నుంచి సబ్బవరం మీదుగా ప్రయాణం చేయాలి.
➦09 తేదీ ఉదయం 6 నుంచి అడవివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య వాహనాలకు నో ఎంట్రీ. దువ్వపాలెం, అక్కిరెడ్డిపాలెం, వేపగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించాలి
➦అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు వాహనాలు విశాఖ సిటీలోకి అనుమతి లేదు. లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి.