News April 1, 2025
విశాఖ: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

విశాఖలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. జీవీఎంసీ జోన్-4 జేఎస్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈరోజు సాయంత్రంలోగా శతశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 2, 2025
విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

కొమ్మాది స్వయంకృషినగర్లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News April 2, 2025
మధురవాడ: తల్లి, కుమార్తెపై ప్రేమోన్మాది దాడి

విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కొమ్మాది సమీపంలోని స్వయంకృషి నగర్లో తల్లి, కూతురిపై ఒక ప్రేమోన్మాది దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందిగా కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలి: కలెక్టర్

పీఎం ఆవాస్ యోజన – ఎన్టీఆర్ కాలనీల గృహనిర్మాణ పథకంలో భాగంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులకు బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు అందించి, నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.