News October 30, 2025
విశాఖ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
Similar News
News October 31, 2025
గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేయాలి: VMRDA ఛైర్మన్

భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్లోని 7 రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించనున్నట్లు తెలిపారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్, వుడా పార్క్లో స్కేట్ బోర్డ్ పనులు కూడా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.
News October 30, 2025
విశాఖ నగర డీసీపీ-1గా జగదీశ్ అడహళ్లి నియామకం

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి జగదీశ్ అడహళ్లిని విశాఖపట్నం నగర డీసీపీ-1గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో UPSCలో 440వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయిన ఆయన, మొదట అసిస్టెంట్ కమిషనర్గా పని చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన జగదీశ్ అడహళ్లి తాజా బదిలీతో విశాఖ డీసీపీ-1 నియమితులయ్యారు.
News October 30, 2025
విశాఖలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

భవనం నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలంటూ ముగ్గురు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తన ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన నర్సింగరావు, అరుణ్ బాబు, శంకర్రావు బెదిరించడం వల్లే తాను అత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. దీంతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.


