News June 23, 2024

విశాఖ: మంత్రి నారా లోకేశ్‌కు లేఖ

image

ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు విశాఖ ఐటి పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్ లేఖ రాశారు. మిలీనియం టవర్లను 10 ప్రముఖ ఐటి కంపెనీలకు 3 సంవత్సరాలకు ఉచితంగా కేటాయించాలని, తద్వారా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హిల్ నెంబర్ 2,3లో ఉన్న పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని నూతన కంపెనీలకు 50 శాతం సబ్సిడీపై అందించాలని, నూతన ఐటీ పాలసీ అమలు చేయాలన్నారు.

Similar News

News October 5, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

News October 5, 2024

విశాఖలో అర్ధరాత్రి దారుణ హత్య

image

విశాఖలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మల్కాపురంలోని యువకుడు వాసుకు తన సోదరులతో వివాదం చోటు చేసుకోగా ఈ ఘటన జరిగింది. వాసు తలపై రాడ్డుతో కొట్టడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 4, 2024

ఏయూకి ఐఎస్ఓ సర్టిఫికేషన్

image

ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికేషన్ 2027 వరకు ఈ గుర్తింపు అందించింది. ఇటీవల ఏయూను సందర్శించిన ఐఎస్ఓ నిపుణుల బృందం ఏయూలో వివిధ అంశాలను పరిశీలించి ఈ గుర్తింపును కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలు ఏయూ ఐక్యూ ఏసీ సమన్వయకర్త ఆచార్య జి.గిరిజా శంకర్ స్వయంగా ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణ రావుకు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.