News October 12, 2025

విశాఖ: ‘మన’వళ్లే అనుకుంటే ముంచేస్తున్నారు..!

image

డబ్బు సంపాదనలో అత్యాశకు పోతున్న యువత పెడదారిన పట్టి సొంతింటికే కన్నాలు వేస్తున్నారు. <<17969023>>కంచరపాలెం<<>>లో 4రోజుల క్రితం నాయనమ్మను స్నేహితులతో బెదిరించి 12తులాల బంగారం, రూ.3లక్షల నగదు కారుతో ఉడాయించిన ఘటన మరవక ముందే అగనంపూడిలో అమ్మమ్మ వద్ద బంగారాన్ని మనవడు తన స్నేహితుడితో <<17982528>>దోపిడీ<<>> చేయించాడు. ఈ రెండు ఘటనల్లో నిందితులు అప్పుల్లో కూరికిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Similar News

News October 12, 2025

గజ్వేల్: 7 నెలల గర్భంతోనే పెళ్లి చేసుకుంది..!

image

గజ్వేల్ పరిధి ములుగు మండలంలో <<17983898>>ఇద్దరిపై పోక్సో కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే. SI విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. సదరు యువతిని ఏడాదిగా ఉదయ్ కిరణ్ అనే యువకుడు లవ్ చేస్తున్నాడు. అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. ఇదే అదనుగా భావించిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో గర్భం దాల్చింది. 7 నెలల గర్భంతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న 13 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News October 12, 2025

శ్రీ రాంసాగర్‌ నీటిమట్టం 80.053 TMCలు

image

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గడంతో ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 TMCలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 80.053 టీఎంసీలు(1090.90 అడుగులు)గా నమోదైంది. కాకతీయ కాలువ ద్వారా 5000, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. FFC అలీ సాగర్, గుప్తా ఎత్తిపోతలలకు నీటి విడుదలను నిలిపివేశారు.

News October 12, 2025

శ్రీ రాంసాగర్‌ నీటిమట్టం 80.053 TMCలు

image

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గడంతో ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 TMCలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 80.053 టీఎంసీలు(1090.90 అడుగులు)గా నమోదైంది. కాకతీయ కాలువ ద్వారా 5000, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. FFC అలీ సాగర్, గుప్తా ఎత్తిపోతలలకు నీటి విడుదలను నిలిపివేశారు.