News April 9, 2024
విశాఖ: ముగిసిన టెన్త్ మూల్యాంకనం

టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈనెల ఒకటో తేదీన జ్ఞానాపురం జూబ్లీ హైస్కూలులో మూల్యాంకనం ప్రారంభమైంది. ఎనిమిది రోజుల్లో మొత్తం 1,76,924 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. అత్యధికంగా ఇంగ్లిష్ సబ్జెక్టు సంబంధించి 29 వేలు, సోషల్ స్టడీస్లో 28 వేల పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనం కోసం 104 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 624 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 208 మంది సహాయకులు పనిచేసారు.
Similar News
News October 4, 2025
విశాఖలో గంజిపడి 16 మంది పిల్లలకు గాయాలు

విశాఖలో అన్నదానం కార్యక్రమం వద్ద శనివారం అపశృతి చోటుచేసుకుంది. జాలరిపేటలోని దుర్గమ్మ ఆలయం సమీపంలో పిల్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద అన్నదాన కార్యక్రమంలో గంజి పడి 16 మంది పిల్లలు, మహిళలు గాయపడ్డారు. బాధితులను కేజీహెచ్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.వాణితో మాట్లాడి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు.
News October 4, 2025
విశాఖలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం

విశాఖ చిల్డ్రన్ ఏరినాలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం ప్రారంభించారు. MLA వెలగపూడి రామకృష్ణ బాబు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.90 లక్షల డ్రైవర్లకు రూ.436 కోట్లు, విశాఖ జిల్లాలో 22,955 మందికి రూ.34.43 కోట్లు లబ్ధి అందనుందని మంత్రి డోలా పేర్కొన్నారు.
News October 4, 2025
భీమిలిలో పేలిన మందుగుండు

విశాఖలో మందుగుండు పేలి ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఇవాళ ఉదయం భీమిలి మండలం వలందపేటలో జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన అమ్మవారి నిమజ్జనోత్సవంలో బాణసంచా కోసం మందుగుండు సామగ్రిని తీసుకొచ్చి తయారు చేస్తుండగా పేలింది. దీంతో మహేశ్, వాసు, కనకరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆరిలోవ ఆసుపత్రికి తరలించారు. సీఐ తిరుమలరావు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.