News September 15, 2025
విశాఖ మెట్రోరైలు నిర్మాణం ఎప్పుడో?

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు ఈనెల 12న టెండర్లకు గడువు ముగిసినా ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపకపోవడంతో అక్టోబరు 7వరకు గడువు పొడిగించారు. ప్రాజెక్టు వయబిలిటీపై బిడ్డర్లకు పలు అనుమానాలు ఉండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,250 కోట్లు. మరోవైపు HYD మెట్రోలో ఎదురైన ఇబ్బందులతో ఇకపై మెట్రో ప్రాజెక్టులు చేయమన్న L&Tప్రకటన కూడా ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు.
Similar News
News September 15, 2025
మెదక్: అట్టహాసంగా ఉమ్మడి జిల్లా కరాటే పోటీలు

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 14 సంవత్సరాలులోపు బాలబాలికలకు
కరాటే పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి 85 మంది బాలురు, 75 మంది బాలికలు మొత్తం 160 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి నాగరాజు, పీఈటీల సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, శ్రీధర్ రెడ్డి, పీడీలు ప్రతాప్ సింగ్, మాధవా రెడ్డి, పూర్ణచందర్ ఉన్నారు.
News September 15, 2025
ప్రజావాణిలో 90 దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్

జనగామలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాని అన్నారు. ప్రజావాణితో ఎంతో మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. అదనపు కలెక్టర్లు బెన్షా లోమ్, పింకేశ్ కుమార్ పాల్గొన్నారు.
News September 15, 2025
కేటీఆర్లా బెదిరింపు దావాలు వేయను: బండి

TG: KTR తనపై వేసిన <<17719172>>పరువునష్టం దావా<<>>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్లా బెదిరింపుల కోసం దావాలు వేయను. దావా వేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్ బయటికే రారు. మీరు తిట్టని తిట్లు లేవు. నేను లవంగం తింటే తంబాకు అన్నావ్. నన్ను వాడు, వీడు అన్నావ్. మీ అయ్య నా తల ఆరు ముక్కలు నరుకుతా అన్నాడు. వీటన్నింటిపై పరువు నష్టం దావా వేయరాదా?’ అని బండి ప్రశ్నించారు.