News March 5, 2025
విశాఖ మెట్రో నాలుగేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి

విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. గాజువాక నుంచి భోగాపురం వయా మద్దిలపాలెం, మధురవాడ మీదుగా 34.6 కి.మీ మేర <<15657173>>మెట్రో నిర్మాణానికి <<>>ప్రతిపాదనలకు కేంద్రానికి పంపామన్నారు. పనులు ప్రారంభమయ్యాక నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. ఏహెచ్ 45 నుంచి ఎన్హెచ్ 16 వరకు 6 రోడ్లు ప్లాన్ చేశామన్నారు. వీటిని ఏడాదిన్నరలోపు ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
Similar News
News November 9, 2025
మల్కాపురంలో యువకుడి మృతి

మల్కాపురంలోని ఓ బార్లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 8, 2025
విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.
News November 8, 2025
విశాఖ: నిర్మాణాల వద్ద వాలిపోతున్న చోటా నేతలు

సొంత ఇంటి నిర్మాణం మధ్యతరగతి కుటుంబాల కల. విశాఖలో కొందరు చోటా నాయకులు తమ ఆగడాలతో సామాన్యుల కలను చిదిమేస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే GVMCకి ఫీజులు చెల్లించి, టౌన్ ప్లానింగ్ అనుమతి తీసుకుంటే చాలు. కానీ ఈ నాయకులు ప్రజల నుంచి ముడుపులు వసూలు చేస్తుండటంతో.. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఓ ఇంటి యజమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. నగరంలో వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.


