News October 19, 2025
విశాఖ మ్యూజియం ఎప్పుడైనా సందర్శించారా?

విశాఖ మ్యూజియం నగర వాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. దీనిని అప్పటి CM జనార్దన్ రెడ్డి 1991లో ప్రారంభించారు. డచ్ భవనంలో ఉన్న మారిటైమ్ మ్యూజియంలోని 10 గదుల్లో నేవీ ఉపయోగించిన ఆయుధాలు, నేవీ చేసిన యుద్దాల సమచారాన్ని కళాఖండాల రూపంలో ప్రదర్శించారు. అదేవిధంగా విశాఖ మ్యూజియం వెనుక ఉన్న రెండంతస్థుల భవనాన్ని హెరిటేజ్ మ్యూజియంగా మార్చారు. ఇందులో పురావస్తు విభాగానికి చెందిన 5 గ్యాలరీలు కలవు.
Similar News
News October 19, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.
News October 19, 2025
HYD: సర్కారు స్కూల్.. ఇక కొత్త స్టైల్

GHMC పరిధిలోని పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. గ్రేటర్ పరిధితోపాటు ఔటర్కు లోపల ఉన్న సర్కారు స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. దాదాపు రూ.3వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. 1,346 ప్రభుత్వ పాఠశాలలకు ఈ మొత్తం కేటాయిస్తారు. అవసరమైతే నూతన భవన నిర్మాణాలతోపాటు, ప్రయోగశాలలు, గ్రౌండ్, లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నివేదిక రూపొందించారు.
News October 19, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన మద్యం దరఖాస్తులు

2023తో పోలిస్తే జిల్లాలో ఈ సంవత్సరంలో 709 దరఖాస్తులు తగ్గాయి. SEP 26న మద్యం టెండర్ల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈనెల 18 నాటికి అంచనాలను తారుమారు చేస్తూ తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 2023లో మద్యం దుకాణాలకు 2033 దరఖాస్తులు రాగా.. ఈ సంవత్సరం నిన్నటి వరకు 1324 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ సంవత్సరం దరఖాస్తులు తగ్గడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగా తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేశారు.