News March 23, 2025
విశాఖ రానున్న మంత్రి కందుల దుర్గేష్

ఏపీ రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం విశాఖ రానున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు రుషికొండ బీచ్ ప్రాంతానికి వస్తారు. అనంతరం ఋషికొండ దగ్గర బ్లూ ఫ్లాగ్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి విశాఖ సర్క్యూట్ హౌస్కి వెళ్లి ముఖ్య నాయకులతో సమావేశమై సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి గన్నవరం వెళ్లనున్నారు.
Similar News
News December 21, 2025
60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్లు ఏర్పాటు చేసి సీపీ

విశాఖలో ఆదివారం జరుగుతున్న ఇండియా- శ్రీలంక క్రికెట్ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 60 మంది స్వచ్చంధ సంస్థల బాలబాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి అవకాశం కల్పించారు. స్వచ్చంధ సంస్థలలో ఉంటున్న 60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్లు ఏర్పాటు చేశారు. సీపీ బాలబాలికలను స్టేడియంలో కలిసి ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.
News December 21, 2025
విశాఖ: 26 మంది వైసీపీ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపు.. క్లారిటీ

GVMCలో కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై వైసీపీ చేసిన ఫిర్యాదును రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. విప్ ధిక్కరణకు సంబంధించి 26 మంది కార్పొరేటర్లకు నేరుగా నోటీసులు అందినట్లు ఆధారాలు లేవన్నారు. 26 మంది కార్పొరేటర్ల ఫిరాయింపుతో TDP మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నందని వైసీపీ ఏప్రిల్లో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది.కాగా 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ విప్ ధిక్కరణ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు.
News December 21, 2025
రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్

విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని చెప్పారు. నగర పౌరులు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేయటం ద్వారా సత్వర పరిష్కారం పొందువచ్చని పేర్కొన్నారు.


