News April 18, 2025
విశాఖ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్

విశాఖ విమానాశ్రయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానంలోని ఇద్దరు ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు, నిషేధిత ఈ- సిగరెట్లను కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66,90,609 ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఫోన్లు, ఈ- సిగరెట్లను నగరానికి అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి వారిని పట్టుకున్నారు.
Similar News
News November 12, 2025
విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు

విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. కాపులుప్పాడలో రూ.115 కోట్లతో.. 2,000 మందికి ఉద్యోగాలిచ్చే విధంగా క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అడ్వాన్స్డ్ డిజిటల్ ఇంజినీరింగ్, AIML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీతో క్యాంపస్ నిర్మించనున్నారు. ఎకరం రూ.కోటి చొప్పున, 4 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది.
News November 12, 2025
విశాఖలో నేటి నుంచి డ్రోన్ ఎగురవేయుట నిషేదం

విశాఖలో భాగస్వామ్య సదస్సులు జరగనున్న నేపథ్యంలో నగరవాసులకు సీపీ శంఖబ్రత బాగ్చి మంగళవారం పలు సూచనలు చేశారు. ఈనెల 12వ తేదీ నుుంచి 16వ తేదీ వరకు ఏయూ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ ఎగురవేయట నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 11, 2025
విశాఖ: అబార్షన్ కిట్ అమ్ముతున్న మెడికల్ షాప్పై కేసు

డాక్టర్ మందులు చీటీ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్పై విశాఖ టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.


