News April 7, 2024

విశాఖ: వృద్ధురాలిపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు

image

ఓ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకుల్ని అత్యాచార నేరం కింద ఎంవీపీ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న పెదవాల్తేరులో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉందని పసిగట్టిన ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ సంఘటనలో యనమరెడ్డి నరేష్ (21), కృష్ణవంశీ (22), బారిక స్వామి(23)పై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సి.ఐ. సంజీవరావు తెలిపారు.

Similar News

News September 10, 2025

అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ ఇవ్వద్దు: జీవీఎంసీ కమిషనర్

image

నగరంలోని జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్ ఫోర్‌లో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనగా అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు ఏసీపీ ఝాన్సీ లక్ష్మీని అడిగారు. జీవన్‌సి ఆర్థిక పరిపుష్టి సాధించే ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ పాల్గొన్నారు.

News September 9, 2025

ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ విజేత విజయవాడ బ్లాస్టర్స్

image

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ 2025లో విజయవాడ బ్లాస్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో రాయలసీమ రాణీస్‌పై 13 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. మేఘన – 49, మహంతి శ్రీ – 37, రంగ లక్ష్మి – 33 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో రిషిక కృష్ణన్ 3 వికెట్లు తీసింది. మిథాలీ రాజ్ చేతుల మీదుగా జట్టు రూ.6 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ అందుకుంది.

News September 9, 2025

ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

మూడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీ కృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు (34), మరో యువకుడు హరీశ్‌ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించామన్నారు.