News April 14, 2025
విశాఖ: వైసీపీకి బెహరా రాజీనామా

విశాఖలో YCPకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నాయకుడైన బెహరా భాస్కర్ రావు రాజీనామా చేశారు. ఆయన వైసీపీ హయాంలో GVMC కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. విశాఖ సౌత్ MLAవంశీకృష్ణ యాదవ్తో సోమవారం భేటీ అయిన నేపథ్యంలో జనసేనలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. YCPకార్పొరేటర్లుగా ఆయన భార్యతో పాటు కోడలు వరుసయ్యే ఆమె ఉన్నారు. మేయర్పై అవిశ్వాసం ముందు వారు నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.
Similar News
News November 6, 2025
విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ!

విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్ పేపర్ లైసెన్స్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దళారీ వ్యవస్థను పెకిలించాలని కోరుతున్నారు.
News November 6, 2025
మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
News November 6, 2025
తిరుపతి కేంద్రంగా కీలక కేసులు దర్యాప్తు

తిరుపతి కీలక కేసుల దర్యాప్తు కేంద్రంగా మారింది. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై 1 మ్యాన్ కమిటీ, కల్తీ నెయ్యి సరఫరాపై CBI నేతృత్వంలోని సిట్, మదనపల్లె ఫైల్స్ దగ్ధంపై CID విచారణ, బోగస్ ఓటర్ కార్డులు, లిక్కర్ స్కాం వంటి కేసుల దర్యాప్తులు సాగుతున్నాయి. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో పరకామణి చోరీ కేసు విచారణ కోసం CID తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది.


