News April 14, 2025
విశాఖ: వైసీపీకి బెహరా రాజీనామా

విశాఖలో YCPకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నాయకుడైన బెహరా భాస్కర్ రావు రాజీనామా చేశారు. ఆయన వైసీపీ హయాంలో GVMC కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. విశాఖ సౌత్ MLAవంశీకృష్ణ యాదవ్తో సోమవారం భేటీ అయిన నేపథ్యంలో జనసేనలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. YCPకార్పొరేటర్లుగా ఆయన భార్యతో పాటు కోడలు వరుసయ్యే ఆమె ఉన్నారు. మేయర్పై అవిశ్వాసం ముందు వారు నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.
Similar News
News April 16, 2025
కొత్తగూడెం: యువతి చదువుకు బాబుమోహన్ భరోసా

కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.
News April 16, 2025
ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు

1848: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు(ఫొటోలో) జననం
1889: హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం
1910: సాహితీవేత్త ఎన్ఎస్ కృష్ణమూర్తి జననం
1914: చిత్రకారుడు కేహెచ్ ఆరా జననం
1951: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ జననం
1853: భారత్లో తొలి పాసింజర్ రైలును బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది
News April 16, 2025
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ WARNING

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు.