News June 20, 2024

విశాఖ శారదాపీఠంలో భద్రత తొలగింపుపై క్లారిటీ

image

విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం Y కేటగిరీలో 2+2 భద్రతను కేటాయించింది. ఆశ్రమానికి సమకూర్చిన ఎస్కార్ట్ వాహనాలకు ఇంధనాన్ని సైతం పోలీసుశాఖే భరిస్తోంది. 20-25 మంది సిబ్బంది విధులు నిర్వహింస్తుండగా.. నెలకు రూ.20 నుంచి 25లక్షలు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే భద్రతను తొలగించారంటూ వస్తున్న వార్తలను పోలీసు అధికారులు కొట్టిపారేశారు. కాగా.. ఇటీవల పీఠాధిపతి సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.

Similar News

News September 17, 2025

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

image

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.

News September 17, 2025

విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

విశాఖలో హెల్త్ క్యాంప్‌ను సందర్శించిన సీఎం

image

CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్‌<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్‌లో టెస్ట్‌లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.