News October 8, 2024

విశాఖ-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 08529, 08530 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు అక్టోబర్ 10 నుంచి 16 వరకు తిరగనున్నాయని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.

Similar News

News October 8, 2024

డిసెంబర్‌లో విశాఖ రైల్వే‌జోన్‌కు శంకుస్థాపన..!

image

కేంద్ర రైల్వే మంత్రి, సీఎం చంద్రబాబు భేటీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబరు కల్లా కొత్త రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలో భాగంగా వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా ఉంచాలని కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ-అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్‌‌ ఏర్పాటు, నమోభారత్‌ కింద విశాఖ-నెల్లూరు మధ్య రైలు అనుసంధానం మెరుగుపరచాలని కోరారు.

News October 8, 2024

విశాఖలో కార్పొరేటర్‌పై రౌడీ షీట్

image

జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేశ్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వైసీపీకి చెందిన సురేశ్‌పై అనేక కేసులు నమోదు అయినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. సొంత పార్టీ నాయకుల ఫిర్యాదుతోనే నాలుగు కేసులు ఆయనపై నమోదయ్యాయి. దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడంతో ఆయనపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News October 8, 2024

విశాఖ: టెట్ పరీక్షకు 84 శాతం మంది హాజరు

image

జిల్లాలో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 84.36 శాతం మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 4610 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3889 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉదయం 5 పరీక్ష కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. తాను ఒక పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.