News August 23, 2025
విశాఖ: సర్టిఫికేషన్ వెరిఫికేషన్కు 32 మంది గైర్హాజరు

కానిస్టేబుల్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ విశాలాక్షి నగర్ ఏఆర్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించారు. 659 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 627 మంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని, మిగతా 32మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉందని అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు 70 మందిలో 69 మంది హాజరు కాగా ఒకరు హాజరు కాలేదు.
Similar News
News August 23, 2025
విశాఖలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్

స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా PMAJAY కింద SC యువతీ/యువకులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 20-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులు. విశాఖ జిల్లా వాసులై, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. అర్హులైన 10 మంది (పురుషులు-5, స్త్రీలు-5)కి APSTRC ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. MVP కాలనీ సంక్షేమ భవన్లో ఆగష్టు 27లోపు దరఖాస్తు అందజేయాలి.
News August 23, 2025
భర్త, కుమార్తెను చంపిన భార్యకు జీవిత ఖైదు: VZM SP

కట్టుకున్న భర్తను, కన్న కూతూరిని హతమార్చిందో మహిళ. భీమిలి (M)కి చెందిన జ్యోతిర్మయి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త రమేశ్ను ప్రియుడు రాము, మరో ఇద్దరి సహాయంతో చంపింది. ఈ సంఘటన చూసిన కుమార్తెను కొత్తవలసలోని బావిలో పడేశారు. VZM టూటౌన్ PSలో 2015లో హత్య కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మహిళకు జీవిత ఖైదు, ఇద్దరికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ తెలిపారు.
News August 23, 2025
69 మంది బాధితులకు రూ.55.50 లక్షలు పంపిణీ

విశాఖ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా కమిషనర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో తీవ్ర గాయాల పాలైన వారికి రూ.50 వేలు చొప్పున ఆరుగురికి రూ.3 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. విశాఖలో ఇప్పటి వరకు 69 మంది రోడ్డు ప్రమాద భాదితులకు సహాయక కేంద్రం ద్వారా రూ.55.50 లక్షలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.