News March 6, 2025

విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఇంటర్ పరీక్షలు

image

విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి పది మంది ఖైదీలు రెగ్యులర్ గాను, మరో ఐదుగురు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీరిలో నలుగురు ఖైదీలు రాజమండ్రి జైలుకు ట్రాన్స్‌ఫర్ కాగా మిగిలినవారు పరీక్షలు రాస్తున్నారు. వీరికి జైలు ప్రాంగణంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశీలకులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జైలు సూపరిండెండెంట్ మహేశ్ బాబు తెలిపారు.

Similar News

News February 17, 2026

72 గంటల పాటు బీచ్ రోడ్డులో డ్రోన్ కెమెరాల నిషేధం

image

విశాఖ IFR, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ అఫ్ చీఫ్స్ నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలు ఉన్న వారికి పలు సూచనలు చేశారు.17వ తేదీ సాయంత్రం 6 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ 72 గంటలు INS డేగా నుంచి పార్క్ హోటల్ వరకూ 5 కిలోమీటర్లు టెంపరరీ రెడ్ జోన్‌గా ప్రకటించారు. 5 కిలోమీటర్లు పరిధిలో డ్రోన్ కెమెరాలు ఎట్టి పరిస్థితులలోనూ వినోయోగించరాదన్నారు. వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News February 17, 2026

గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు షాక్: వైసీపీ

image

4 వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని గీతం వర్సిటీని సుప్రీంకోర్టు ఆదేశించిందని వైసీపీ ట్వీట్ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని.. లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీ చేసిందని అందులో పేర్కొంది. తమను ఈ బకాయిలు చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం బుకాయించినా.. వీబీసీ, గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదించిందంది.

News February 17, 2026

విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

image

అంతర్జాతీయ నౌకాదళ (IFR-2026) విన్యాసాల దృష్ట్యా విశాఖలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలపై VMRDA ఆంక్షలు విధించింది. కైలాసగిరి, సబ్‌మెరైన్, సీ-హారియర్ మ్యూజియంలు ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.