News July 12, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక విభాగాల పరిశీలనకు కమిటీ

image

విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నేస్, రోలింగ్ మిల్స్, కోకో వెన్ విభాగాల పనితీరు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెయిల్ నుంచి ముగ్గురు అధికారుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కమిటీలో టాపస్ దాస్ గుప్తా, సమీర్ రాయ్ చౌధురి (బిలాయ్ స్టీల్ ప్లాంట్), ప్రకాష్ బొండేకర్ (దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్) ఉన్నారు. వీరు త్వరలో విశాఖ ఉక్కును సందర్శించనున్నారు.

Similar News

News February 1, 2026

కేజీహెచ్‌లో రాష్ట్రంలోనే తొలిగా ‘పెయిన్ క్లినిక్’ ప్రారంభం

image

విశాఖ కేజీహెచ్‌లో రాష్ట్రంలోనే మొదటి ‘పెయిన్ క్లినిక్’ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. AMCANA సంస్థ రూ. కోటి విరాళంతో దీనిని ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక, క్యాన్సర్ నొప్పులతో బాధపడే రోగులకు ఈ క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

News February 1, 2026

విశాఖ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు రెండు విడతల్లో ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 35,404 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నట్లు ఆర్జేడీ మురళీదర్ తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు 30,433 కాగా, బైపీసీ వారు 4,971 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలో 159 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News January 31, 2026

విశాఖ: మహిళకి ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు

image

KGH వైద్యులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన R.సాయమ్మ (46) అనే మహిళకు సంక్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు. బొబ్బలి సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయమ్మ గాయపడి KGHలో చేరారు. ఆమె దవడ, కంటి చుట్టూ ఎముకలు విరగగా, ప్లాస్టిక్ సర్జరీ, కంటి వైద్య నిపుణులు సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లను సూపరింటెండెంట్ డా.ఐ. వాణి అభినందించారు.