News August 3, 2024
విశాఖ: స్థాయిా సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు

జీవీఎంసీ స్థాయిా సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు నిలిచినట్లు అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.
Similar News
News January 2, 2026
విశాఖ జిల్లాలో 1,232 టన్నుల ఎరువులు సిద్ధం

విశాఖపట్నం జిల్లాలో రబీ సాగుకు అవసరమైన ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వి. ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 6,532 హెక్టార్లలో పంటలు సాగు కాగా, జనవరి చివరి వరకు సరిపడేలా 1,232 టన్నుల ఎరువులు (722 టన్నుల యూరియా సహా) సిద్ధంగా ఉన్నాయన్నారు. మార్క్ఫెడ్, రైతు సేవా కేంద్రాల వద్ద నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
News January 2, 2026
జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.
News January 2, 2026
విశాఖలో రెండు రోజుల పాటు తెలంగాణ గవర్నర్ పర్యటన

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రెండు రోజుల విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం తూర్పు నావికా దళం (ENC) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాత్రి 8.35 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.


