News April 7, 2024
విశాఖ: హిందుస్థాన్ షిప్ యార్డ్ టర్నోవర్ రూ. 1,597 కోట్లు

హిందుస్థాన్ షిప్ యార్డ్ టర్నోవర్ వరుస ఆర్థిక సంవత్సరాల్లో రూ.478 కోట్ల నుంచి రూ. 1,597 కోట్లకు పెరిగి రికార్డు నెలకొల్పిందని సంస్థ యాజమాన్యం శనివారం తెలియజేసింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రూ.478 కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ సంస్థ రూ.14 కోట్ల నష్టాల్లో ఉండేది. ఆ తర్వాత 2021-22లో రూ.755 కోట్ల టర్నోవర్కు చేరి రూ.51 కోట్ల లాభం గడించింది. 2022-23లో రూ.1103 కోట్ల టర్నోవర్కు రూ.65 కోట్ల లాభం వచ్చింది.
Similar News
News September 10, 2025
అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ ఇవ్వద్దు: జీవీఎంసీ కమిషనర్

నగరంలోని జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్ ఫోర్లో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనగా అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు ఏసీపీ ఝాన్సీ లక్ష్మీని అడిగారు. జీవన్సి ఆర్థిక పరిపుష్టి సాధించే ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ పాల్గొన్నారు.
News September 9, 2025
ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ విజేత విజయవాడ బ్లాస్టర్స్

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ 2025లో విజయవాడ బ్లాస్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో రాయలసీమ రాణీస్పై 13 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. మేఘన – 49, మహంతి శ్రీ – 37, రంగ లక్ష్మి – 33 పరుగులతో రాణించారు. బౌలింగ్లో రిషిక కృష్ణన్ 3 వికెట్లు తీసింది. మిథాలీ రాజ్ చేతుల మీదుగా జట్టు రూ.6 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ అందుకుంది.
News September 9, 2025
ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మూడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీ కృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు (34), మరో యువకుడు హరీశ్ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించామన్నారు.