News March 27, 2024

విశాఖ: 315 మందికి షోకాజ్ నోటీసులు

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌కు హాజరుకాని 315 మంది ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఇన్ ఛార్జ్, ఆర్.ఐ.ఓ మురళీకృష్ణ తెలిపారు. రోజుకు రూ.1000 చొప్పున కళాశాల యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని తెలిపారు. మూల్యాంకనానికి ప్రైవేట్ కార్పొరేట్, కళాశాలల అధ్యాపకులను వెళ్ళనీయకుండా యాజమాన్యాలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News

News February 8, 2025

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు

image

రాజస్థాన్‌లో జరుగుతున్న 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ నుంచి 33 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 5 స్వర్ణ, 7రజత, 10 కాంస్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. వీరికి శుక్రవారం పలువురు అభినందనలు తెలిపారు. విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.

News February 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలని అధికారుల‌ను విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు. నామినేష‌న్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వ‌సతుల క‌ల్ప‌న‌, జాబితాల త‌యారీ, సిబ్బంది కేటాయింపు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌న్నారు.

News February 7, 2025

విశాఖ మీదుగా వెళ్లే యశ్వంత్పూర్ రైలు రద్దు

image

టాటా నగర్ నుంచి విశాఖ మీదగా యశ్వంత్పూర్ వెళ్లే రైలును(18111/12) ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఖమ్మం డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు తెలిపారు. యశ్వంత్పూర్ నుంచి విశాఖ మీదగా టాటానగర్ వెళ్లే రైలు కూడా ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

error: Content is protected !!