News January 1, 2026

విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

image

AP: న్యూఇయర్ వేళ నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(2)కు విషమిచ్చి సురేందర్(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను పెంచే స్తోమత లేక సురేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది సురేంద్ర భార్య మహేశ్వరి(32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

Similar News

News February 19, 2026

ప్రేయసితో ❤️ పెళ్లికి సిద్ధమైన ధవన్.. ఫొటోలు వైరల్

image

IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ప్రేయసి సోఫీ షైన్‌(ఐర్లాండ్)తో పెళ్లికి సిద్ధమయ్యారు. నిన్న సంగీత్ వేడుకల ఫొటోలను SMలో షేర్ చేయగా వైరలవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా AUSకు చెందిన ఆయేషాను ధవన్ 2012లో వివాహం చేసుకొని 2023లో విడాకులు తీసుకున్నారు.

News February 19, 2026

రూ.20 లక్షల ఉద్యోగం వస్తేనే అభిషేకం.. విద్యార్థి లేఖ వైరల్

image

AP: ఏలూరు(D) తాడువాయిలోని శ్రీభద్రకాళి వీరేశ్వరస్వామి ఆలయ హుండీలో ఓ విద్యార్థి వేసిన లేఖ వైరలవుతోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో తనకు 9CGPA మార్కులు, తర్వాత ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరాడు. అప్పుడు అభిషేకం చేయించి బట్టలు ఇస్తానని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ కుర్రాడు దేవునితో డీల్ మాట్లాడుకున్నాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

News February 19, 2026

రైతులను పెళ్లాడే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి.. MLA అభ్యర్థన

image

కర్ణాటకలో INC MLA రంగనాథ్ ఓ వినూత్న ప్రతిపాదనతో CM సిద్దరామయ్యకు లేఖ రాశారు. రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ‘నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న కునిగల్ సెగ్మెంట్‌లో మెజార్టీ ఫ్యామిలీలకు అగ్రికల్చరే జీవనోపాధి. అక్కడ వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావట్లేదు. దీంతో చాలామంది 30ఏళ్లు దాటినా ఒంటరిగానే మిగిలిపోతున్నారు’ అని పేర్కొన్నారు.