News January 28, 2025
విషాదం: హుస్సేన్సాగర్లో మృతదేహం లభ్యం

హుస్సేన్సాగర్లో అజయ్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన నాగారం వాసి అజయ్ కోసం కోసం DRF, NDRF దాదాపు 45 గంటలు గాలించాయి. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశాయి. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. భారత మాత హారతి కార్యక్రమంలో టపాసులు కాల్చుతుండగా ప్రమాదం జరగగా పలువురు గాయపడ్డారు. తప్పించుకునే క్రమంలో అజయ్ నీటిలో దూకేసినా ప్రాణాలు దక్కకపోవడం బాధాకరం.
Similar News
News December 31, 2025
2025లో నేరాల అదుపుకి కృషి చేశాం: SP

2025లో జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఈ ఏడాది 26 హత్య, 29 అపహరణ, 59 మానభంగం మరియు 125 పోక్సో కేసులు నమోదయ్యాయని వివరించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు ఆస్తి నేరాల నియంత్రణకు గస్తీ పెంచినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తోందని ఎస్పీ వెల్లడించారు.
News December 31, 2025
పడక గదిలో పదునైన వస్తువులు ఉండకూడదా?

కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను బెడ్ రూమ్లో ఉంచకూడదని వాస్తు, జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కలహాలు పెరుగుతాయని అంటున్నారు. ‘మానసిక ఒత్తిడిని కలిగించి నిద్రలేమి సమస్యలకు దారితీస్తాయి. వీటిని ఎప్పుడూ బహిరంగంగా ఉంచకూడదు. వంట గదిలోనే ఎవరూ చేయి పెట్టని ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం. పడక గదిలో వీటిని నివారిస్తే.. అశాంతి దూరమవుతుంది’ అంటున్నారు.
News December 31, 2025
అమరావతి ఐకానిక్ ‘ధ్యాన బుద్ధ’.. అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధ్యాన బుద్ధ విగ్రహం పల్నాడు జిల్లా అమరావతి సమీపంలోని ధరణికోట వద్ద, కృష్ణా నది తీరాన కొలువై ఉంది. 4.5 ఎకరాల విశాల ప్రాంగణంలో, భారీ పద్మంపై 125 అడుగుల ఎత్తుతో ధ్యాన ముద్రలో ఉన్న ఈ బుద్ధుని విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రాజధాని ప్రాంతానికే ఐకానిక్గా నిలిచిన ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.


