News January 30, 2026
విష్ణుమూర్తిని నేడు ఎలా పూజించాలంటే..?

వరాహ ద్వాదశి నాడు విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. రాగి/ఇత్తడి చెంబులో గంగాజలం నింపి, అక్షితలు, పువ్వులు, మామిడి ఆకులతో అలంకరించాలి. పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని సిద్ధం చేయాలి. ఈ కలశంపై వరాహ స్వామిని ప్రతిష్టించి షోడశోపచార పూజ చేయాలి. స్వామికి పసుపు వస్త్రాలు, తులసి దళాలు, బెల్లం నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. పేదలకు దానాలు చేస్తే తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
Similar News
News February 8, 2026
జైలుకెళ్లిన ప్రముఖ జ్యోతిషుడు.. బ్యాగ్రౌండ్ చూస్తే

కర్ణాటక జ్యోతిషుడు కమలాకర్ భట్ ఫ్లాష్బ్యాక్ సినిమా స్టోరీనే. తమలపాకులు, మరమరాలు అమ్మిన ఆయన.. జ్యోతిషుడైతే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో 2005లో కేరళలో ఆ విద్య నేర్చాడు. త్వరగా పాపులరవ్వాలని TVల్లో ఆస్ట్రాలజీ చెప్పాడు. సమస్యలున్న వారిని తీసుకొచ్చే ఏజెంట్లకు కమీషన్ ఇస్తూ ₹వందల కోట్లు పోగేశాడు. ఏజెంట్ సుచిత్రతో అక్రమసంబంధం సాగిస్తూ, అడ్డుగా ఉన్నారని ఆ కుటుంబంపై గతవారం దాడి చేయించి జైలుకెళ్లాడు.
News February 8, 2026
మనకు చెడు చేసినవారు బంధువులైతే?

కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ||
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||
జాలి పడొద్దు. సవాళ్లకు భయపడి బాధ్యతలు వీడొద్దు. రణరంగంలో ఎదురుగా ఎవరున్నారన్నది అనవసరం. వెనకడుగు వేయడం మనోదౌర్బల్యం. భయం, పిరికితనం వీడి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. పోరాటమే అసలు విజయం. అప్పుడే లక్ష్యం సాధిస్తాం. <<-se>>#MSBP<<>>
News February 8, 2026
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.


