News August 21, 2025
విస్తృత తనిఖీలు నిర్వహించాలి: జేసీ

ప్రకాశం జిల్లా లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ గురువారం ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని చౌక దుకాణాలపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జేసీ సమావేశంలో అధికారులకు సూచించారు.
Similar News
News August 21, 2025
ప్రకాశం: ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్కు దరఖాస్తుల ఆహ్వానం!

జిల్లాలో హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 27లోగా సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఒక సంవత్సరం కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా శిక్షణ అందుతుందన్నారు. ఎస్సీ అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు ఎగ్జిక్యూటివ్ అధికారి నంబర్ 9849905970 ను సంప్రదించాలన్నారు.
News August 21, 2025
పద్ధతి మార్చుకోకపోతే.. జాబ్ నుంచే తొలగిస్తా: కలెక్టర్ వార్నింగ్

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యోగం ఎందుకు? పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేసేస్తా అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. వాస్తవ వివరాలను నమోదు చేయకుండా పలువురు ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు.
News August 21, 2025
ప్రకాశానికి మంత్రుల రాక

జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.