News September 2, 2025
వీఆర్ పురంలో గుర్తు తెలియని మృతదేహం

వీఆర్ పురం మండలంలోని చిన్న మట్టపల్లి పంచాయతీ పరిధిలోని ప్రత్తిపాక గ్రామ శివారులలో గుర్తు తెలియని పురుష మృతదేహం కనిపించిందని ఎస్ఐ సంతోశ్ కుమార్ మంగళవారం తెలిపారు. శబరి నది నుంచి కొట్టుకుని వచ్చి, బోర్లా పడి ఉందన్నారు. వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. ఎత్తు 5 అడుగుల రెండు అంగుళాలు, ఎరుపు రంగు షార్ట్ వేసుకుని ఉందన్నారు. ఎవరైనా గుర్తు పడితే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.
Similar News
News September 3, 2025
TODAY HEADLINES

* తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు: రేవంత్
* టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు
* రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు: జగన్
* క్రీడాకారుల కోసం ప్రత్యేక సిలబస్: లోకేశ్
* BRS నుంచి కవిత సస్పెండ్
* సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
* భారీగా పెరిగిన బంగారం ధరలు
News September 3, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

✓ పరకాల రక్తపుటేరుకు 78 ఏళ్లు!
✓ JN: మైనర్లకు వాహనం ఇస్తే లక్ష రూపాయల జరిమానా
✓ కాజీపేట: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
✓ HNK: గంజాయి పట్టుకున్న పోలీసులకు రివార్డులు
✓ ఆఫర్ల కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు: WGL సైబర్ పోలీస్
✓ గణేష్ మండపాల వేదికగా సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సులు
✓ గణేష్ శోభాయాత్రలో డీజేలపై నిషేధం: ASP
News September 3, 2025
జమ్మికుంట: రైలు నుండి పడి వ్యక్తి మృతి

పెద్దపల్లి(D) పాలకుర్తి మం. కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్(33) రైలు నుంచి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో JMKT-బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.